కొడుకు మృతదేహాన్ని తండ్రి 90కి.మీ.బైక్పై తీసుకెళ్లడం బాధాకరం
తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద జరిగిన హృదయ విదారకర ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.
దిశ, ఏపీ బ్యూరో : తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద జరిగిన హృదయ విదారకర ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆస్పత్రి నుంచి బాలుడి మృత దేహాన్ని తండ్రి బైక్ పై తరలించిన ఘటన తనను కలచివేసిందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన బాలుడు జేసవా మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బైక్ పై తరలించాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యమేనంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడుకు మృతదేహాన్ని 90 కిలోమీటర్లు బైక్ పై తీసుకువెళ్లిన ఘటన రాష్ట్రంలో హెల్త్ కేర్ సెక్టార్లో దుస్థితికి అద్దం పడుతుందని చంద్రబాబు మండిపడ్డారు. ఇందుకు సంబంధించి బాలుడు మృత దేహాన్ని తండ్రి బైక్ పై తరలిస్తున్న వీడియోను చంద్రబాబు ట్విటర్లో పోస్ట్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు.