హన్మకొండ జిల్లలో అమానుష ఘటన!.. ఆడపిల్ల పుట్టిందని సజీవంగా పాతిపెట్టారు

పిల్లలు పుట్టడంలేదని ఎందరో దంపతులు ఆసుపత్రుల చుట్టు తిరుగున్న ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టిందని బ్రతికుండగానే మట్టిలో పాతి పెట్టిన అమానుష ఘటన హన్మకొండ జిల్లాలో జరిగింది.

Update: 2024-05-05 07:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పిల్లలు పుట్టడంలేదని ఎందరో దంపతులు ఆసుపత్రుల చుట్టు తిరుగున్న ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టిందని బ్రతికుండగానే మట్టిలో పాతి పెట్టిన అమానుష ఘటన హన్మకొండ జిల్లాలో జరిగింది. హన్మకొండ జిల్లా దామెర మండలంలోని ఊరుగొండ శివారులో ఆదివారం ఉదయం రోడ్డు పక్కన ఆగిన ఓ లారీ డ్రైవర్ అకస్మాత్తుగా భూమిలో కదలికలు రావడం గమణించాడు. వెంటనే తవ్వి చూడగా కొద్దిసేపటి క్రితమే పుట్టిన పసికందు ముఖం కనిపించింది. అనంతరం పక్కనే ఉన్న ఉపాది హామీ కూలీలను పిలిచి వారి సహాయంతో పాపను మట్టిలోనుంచి సురక్షితంగా బయటకు తీశారు. పాపకు కనీసం బొడ్డు పేగు కూడా సక్రమంగా కత్తిరించలేదని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న ఎస్సై అక్కడికి చేరుకొని, హుటాహుటిన పాపను స్థానిక ఎన్ఎస్ఆర్ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం పాపను ఎంజీఎం హాస్పిటల్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. అంతేగాక ప్రస్తుతం పాప పరిస్థితి నిలకడగా ఉందని ఎంజీఎం హాస్పిటల్ వైద్యులు తెలిపారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్సే వివరించారు. అర్థ గంటకు పైగా మట్టిలో పాతి పెట్టిన కూడా పాప ప్రాణాలతో బ్రతికి ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Similar News