ఎన్నికల వేళ చంద్రబాబు, లోకేష్కు షాక్.. ల్యాండ్ టైటిలింగ్ ఫేక్ ప్రచారం పై సీఐడీ దర్యాప్తు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయ వేడి రోజు రోజు కి పెరుగుతుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ల్యాండ్ టైటిలింగ్ పై టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది.
దిశ, వెబ్డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయ వేడి రోజు రోజు కి పెరుగుతుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ల్యాండ్ టైటిలింగ్ పై టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను నిషేధిస్తామని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు.. ఎన్నికల అధికారిని ఆశ్రయించారు. ఐవీఆర్ఎస్ కాల్స్తో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేశారని వైసీపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న సీఐడీ అధికారులు.. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారా లోకేష్ లను చేర్చారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో దుమారం చెలరేగుతోంది.