ముడా చైర్మన్‌గా గంజి వెంకన్న ముదిరాజ్..

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా ) చైర్మన్‌గా- Latest Telugu News

Update: 2022-04-02 12:44 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా ) చైర్మన్‌గా మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ గంజి వెంకన్న ముదిరాజ్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఉగాది పండగ రోజున శనివారం రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కమిటీ జాబితాను సీఎం కేసీఆర్‌కు అందజేశారు.

పాలకమండలి సభ్యులుగా బి రవిశంకర్, వై జి ప్రీతం కుమార్, ఎం. శ్రీకాంత్( జడ్చర్ల), ఆర్. భూపాల్( బాలనగర్), ఎం శ్రీశైలం యాదవ్( రాజాపూర్), మహమ్మద్ ఇంతియాజ్(కోడ్గల్ ) ఎస్. చంద్రశేఖర్ గౌడ్( భూత్పూర్), మూస సాయిలు( అమిస్తాపూర్), కే లక్ష్మీకాంతరావు( దేవరకద్ర), జి చెన్నయ్య( నవాబుపేట), కొండ బాలయ్య( హన్వాడ), ఏ సాయిలు యాదవ్, పి వెంకటేష్ గౌడ్, మిర్యాల వేణుగోపాల్ గుప్తా ( మహబూబ్ నగర్), కె ఆంజనేయులు( జమిస్తాపూర్), నియామకం అయినట్లు మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఇందుకు సంబంధించిన జీవోను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Tags:    

Similar News