టీఆర్ఎస్ వేదికపై బీజేపీ మహిళా కార్యకర్త (వీడియో)

దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ చర్చా వేదిక వద్ద బీజేపీ మహిళా కార్యకర్త ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింది.

Update: 2022-08-05 06:33 GMT

దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్‌లో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ చర్చా వేదిక వద్ద బీజేపీ మహిళా కార్యకర్త ప్రత్యక్షం కావడం కలకలం సృష్టించింది. హుజురాబాద్‌లో జరిగిన అభివృద్ధిపై టీఆర్ఎస్ బహిరంగ చర్చకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో టీఆరెస్ పార్టీ ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేయగా అక్కడకు బీజేపీ మహిళా కార్యకర్త చేరుకోవడంతో టీఆర్ఎస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. వేదిక కింద ఉన్న టీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు ఆమెను కిందకు దింపారు. బీజేపీ కార్యకర్త మాత్రం టీఆర్ఎస్ నాయకులతో చర్చకు దిగేందుకు ప్రయత్నించారు.

Similar News