Allu Arjun: అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం..

Allu Arjun Invited for Grand marshal India Today Parade as chief Guest| సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్ లో సూపర్ సక్సస్ కావడం తో అల్లు అర్జన్ క్రేజ్ మరింత గా పెరిగిపోయింది.ఈ సినిమాల్లో డైలాగ్ లు తగ్గేదేలే.. అనే డైలాగ్ తో సెలబ్రెటీలు

Update: 2022-07-18 06:35 GMT

దిశ,వెబ్‌డెస్క్: Allu Arjun Invited for Grand marshal India Today Parade as chief Guest| సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్ లో సూపర్ సక్సస్ కావడం తో అల్లు అర్జన్ క్రేజ్ మరింత గా పెరిగిపోయింది.ఈ సినిమాల్లో డైలాగ్ లు తగ్గేదేలే.. అనే డైలాగ్ తో సెలబ్రెటీలు, క్రికెటర్లు కూడా, రీల్స్ చేస్తూ వారి అభిమానులను అలరించారు.అంతే కాకుండా సమంత హైటమ్ సాంగ్ చేసిన ఊ అంటవా మామా అనే పాట కూడా భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే సుకుమార్ పుష్ప రూల్ కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది.ఆగస్టు 21వ తేదీన న్యూయార్క్‌లో జరగనున్న గ్రాండ్ మార్షల్ ఇండియా డే పరేడ్‌కి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్లు గా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ వెల్లడించింది. ఈ సందర్భంగా ఆగస్ట్ 21న 40వ భారత స్వాతంత్ర దినోత్సవ పరేడ్ కి అల్లు అర్జున్ నాయకత్వం వహిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ అధ్యక్షులు కెన్నీ దేశాయ్ వెల్లడించారు.దీంతో అల్లు అర్జున్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇది కూడా చదవండి: పెళ్లికి సిద్ధమైన నిత్యామీనన్.. ఆ స్టార్ హీరో ఎవరంటే ?

Tags:    

Similar News