తాగు నీటికి తండ్లాట… రోడ్డుపై బైఠాయించి నిరసన

మండలం లోని కుమ్మరి కుంట్ల గ్రామంలో తాగునీటి సమస్యతో

Update: 2024-03-28 08:48 GMT

దిశ,దంతాలపల్లి : మండలం లోని కుమ్మరి కుంట్ల గ్రామంలో తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో గురువారం ఉదయం మహిళలు, కాలనీ వాసులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గత 15 రోజుల నుంచి నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.తమ కాలనీకి సమీపంలో వాటర్ ట్యాంక్ ఉన్నప్పటికీ భగీరథ నీరుతో కొంత మేర నీటి సమస్య తీరుతుండేది.. కానీ భగీరథ నీరు సరఫరా చెయ్యకపోవడం తోనే నీటి కొరత ఏర్పడిందని వారు తెలిపారు. 100 కుటుంబాలు ఉన్న ఏరియాలో పంచాయతీ బోర్ల నుంచి కూడా సక్రమంగా నీటి సరఫరా జరగడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు చోరువచుపి కుమ్మరి కుంట్ల గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు కోరుతున్నారు.

Similar News