కడియం కావ్యకి లక్ష మెజారిటీ అందివ్వాలి : పాలకుర్తి ఎమ్మెల్యే

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో మార్కెట్ సెంటర్ లో పార్లమెంట్

Update: 2024-05-08 16:50 GMT

దిశ, తొర్రూర్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో మార్కెట్ సెంటర్ లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి,నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి.ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డా.కడియం కావ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు ఆకర్షితులై బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హస్తం గూటికి చేరుతున్నారు.వారందరికీ కృతజ్ఞతలు, మీ అందరిని కాపాడుకునే బాధ్యత మాది.భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, బిజెపికి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటు వేస్తే మన భవిష్యత్తుకు మనమే గోతి తీసుకున్న వాళ్లమవుతామని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని, ఓటు హక్కును రద్దు చేస్తారని తెలిపారు.దేశ భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డా, కడియం కావ్య మెజార్టీ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.

కడియం కావ్య మాట్లాడుతూ..

నరేంద్ర మోడీ దేశాన్ని విచ్చిన్నం చేస్తూ విద్వేషాన్ని రెచ్చగొడుతూ మనుషుల్ని కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా విడదీసి రాక్షస పాలన సాగిస్తున్నాడు,నరేంద్ర మోడీ దేశాన్ని అమ్మకానికి పెడుతున్నాడు, దళితులు, పేదలు, క్రిస్టియన్ లు, ముస్లింలు, మహిళలు అంటే గిట్టదు అని, ఈ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పి మన రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవాలని కావ్య అన్నారు. రాహుల్ గాంధీ మాత్రమే భారతదేశాన్ని ప్రగతి బాటలో ముందుకు నడుపుతారు అని, బి.ఆర్ అంబేద్కర్ శక్తి ఏంటో మనం చూపించాలి అని, మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు గ్రామ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Similar News