గుండెపోటుతో అటవీ శాఖ ఉద్యోగ మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని గారేపల్లి నివాసి అటవీ శాఖలో బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్న బద్ది కృష్ణ గుండెపోటు రావడంతో గురువారం మరణించారు.
దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని గారేపల్లి నివాసి అటవీ శాఖలో బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్న బద్ది కృష్ణ గుండెపోటు రావడంతో గురువారం మరణించారు. మండలంలోని ఓడిపిలవంచ గ్రామానికి చెందిన బద్రి కృష్ణ ప్రస్తుతం పెద్దపెల్లి జిల్లా కల్వచర్ల గ్రామంలో బీట్ ఆఫీసర్గా ఉద్యోగం నిర్వహిస్తున్నారు. గతంలో కాటారం, మహా ముత్తారం మండలాల్లో ఉద్యోగం చేశారు. బంది కృష్ణ మృతి పట్ల అటవీ శాఖ ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ప్రజాప్రతినిధులు , స్నేహితులు అటవీ శాఖ ఉద్యోగులు బద్ది కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.