దుకాణాలలో వ్యవసాయ అధికారి తనిఖీ..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఎరువులు, పురుగు మందులు విత్తనాల దుకాణాలను కాటారం వ్యవసాయ అధికారి రామకృష్ణ తనిఖీ చేశారు.

Update: 2023-06-18 09:54 GMT

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఎరువులు, పురుగు మందులు విత్తనాల దుకాణాలను కాటారం వ్యవసాయ అధికారి రామకృష్ణ తనిఖీ చేశారు. పత్తివిత్తనాల లాక్ మార్కెట్ గంగా శీర్షికతో ఆదివారం విషపత్రికలో వచ్చిన కథనం మేరకు వ్యవసాయ అధికారి విస్తృత తనిఖీలు చేపట్టారు.

వ్యవసాయాధికారి రామకృష్ణ మాట్లాడుతూ మండలంలో పత్తివిత్తనాలను ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువగా ఎవరు విక్రయించిన సమాచారం అందించాలని, ఇతను ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. డీలరు ఉద్దేశపూర్వకంగా విత్తనాలకు బ్లాక్ మార్కెట్ సృష్టించిన అధిక ధరలకు విక్రయించిన చర్యలు తీసుకుంటామని రైతులు తెలుసుకోవాలని వ్యవసాయ అధికారి ప్రకటనలో పేర్కొన్నారు. దుకాణాలలో స్టాక్ రిజిస్టర్లు ఇతర రికార్డులను వ్యవసాయ అధికారి సిబ్బందితో కలిసి పరిశీలించారు.

Tags:    

Similar News