అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ప్రభుత్వ పాఠశాల
మండలంలోని చింతల తండా ప్రభుత్వ పాఠశాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. తరగతి గది కిటికీ పగులగొట్టిన దుండగులు చెత్తచెదారం వేశారు.
దిశ, వేలేరు: మండలంలోని చింతల తండా ప్రభుత్వ పాఠశాల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. తరగతి గది కిటికీ పగులగొట్టిన దుండగులు చెత్తచెదారం వేశారు. ప్రతిరోజూ ఉదయం విద్యార్థులు వచ్చేసరికి పాఠశాల వరండాలో మలమూత్రాలు పోస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న దుండగులను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలలకు రాత్రివేళల్లో కాపలాదారులు, సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.