హైనా దాడిలో గేదె మృతి

చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో గేదెపై హైనా దాడి చేసి చంపేసింది.

Update: 2023-01-31 11:01 GMT

దిశ, చేర్యాల: మండలంలోని వీరన్నపేట గ్రామంలో రెండు రోజుల క్రితం హైనా దాడిలో గేదే మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా రాత్రి మండలంలోని ముస్త్యాల గ్రామంలో హైనా గేదేపై దాడి చేసి చంపడంతో రైతులు కలవరపడుతున్నారు. ముస్త్యాల గ్రామానికి చెందిన కేశిరెడ్డి ప్రణీత్ రెడ్డి అనే రైతు వ్యవసాయ పొలం కొట్టం వద్ద ఉంచిన గేదెపై గత రాత్రి హైనా దాడి చేసి చంపినట్లు రైతు తెలిపాడు. కాగా వరుసగా రెండు రోజులు గేదేలపై దాడులు చేస్తూ గేదే లను చంపుతుండగా రైతులు భయందోలనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి గేదేలపై హైనా దాడులు జరగకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.

Similar News