ఆశీర్వదించండి.. ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తా.. : బీబీ పాటిల్

జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆశీర్వదించి తనని గెలిపిస్తే ఈ

Update: 2024-04-29 12:07 GMT

దిశ, పెద్ద శంకరంపేట్ : జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆశీర్వదించి తనని గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక రంగాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. సోమవారం పెద్ద శంకరంపేటలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో చిలపల్లి ఎంపిటిసి దామోదర్.. శివయ్య పల్లి బూరుగుపల్లి టింకటి గ్రామాలకు చెందిన పలువురు యువకులు పేట మండల బిజెపి అధ్యక్షుడు కోణం విఠల్ ఆధ్వర్యంలో బీబీ పాటిల్ సమక్షంలో బిజెపిలో చేరారు.ఈ సందర్భంగా బీబీ పాటిల్ మాట్లాడుతూ నేడు అల్లాదుర్గం లో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభను అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు.బీజేపీతోనే భారతదేశ సుస్థిర అభివృద్ధి సాధ్యమని మూడోసారి బీజేపీకి ఓటు వేసి గెలిపించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ బిజెపిని గెలిపించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు మాజీ సర్పంచులు, సూర్య ప్రకాష్, సుభాష్, గంగారెడ్డి, సాయిలు, వెంకయ్య, సురేందర్ రెడ్డి ,సంగమేశ్వర్, మంగలి కృష్ణ,సురేష్,సాయిలు,బుగుడాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Similar News