BREAKING: నిజామాబాద్ ప్రజలకు కేంద్ర మంత్రి అమిత్ షా బంపర్ ఆఫర్
నిజామాబాద్ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బంపర్ ఆఫర్ ఇచ్చారు. ధర్మపురి అర్వింద్ను రెండోసారి ఎంపీ గెలిపించండి..
దిశ, వెబ్డెస్క్: నిజామాబాద్ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బంపర్ ఆఫర్ ఇచ్చారు. ధర్మపురి అర్వింద్ను రెండోసారి ఎంపీగా గెలిపించండి.. నిజామాబాద్లోనే పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం పెడతామని, బీడీ కార్మికులకు ఆస్పత్రి కట్టిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ గెలుపునూ కాంక్షిస్తూ ఆదివారం నిజామాబాద్లో అమిత్ షా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మరోసారి అర్వింద్ను ఎంపీగా గెలిపిస్తే నిజామాబాద్లో చక్కెర పరిశ్రమలు తెరిపిస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఏటీఎంలా మార్చుకుందని, రాహుల్, రేవంత్ రెడ్డి పేరుతో ఆర్ఆర్ ట్యాక్స్ వసూల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏబీసీ అంటే అసదుద్దీన్, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ బాబా పార్టీ అని ఎద్దేవా చేశారు. సంవత్సరాల కొద్ది రామమందిర నిర్మాణాన్ని అడ్డుకుందని కాంగ్రెస్సేనని నిప్పులు చెరిగారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు భయపడి రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాలేదని ఫైర్ అయ్యారు. దేశంలో మావోయిస్టులను కూడా పూర్తిగా అంతమొందిస్తామని అన్నారు.
Read More...
ఏబీసీ అంటే అసద్, బీఆర్ఎస్, కాంగ్రెస్.. 10 సీట్లు గెలుస్తాం.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు