తెలంగాణలో ఒకే రోజు మూడు అవినీతి కేసులు
రాష్ట్రంలోని వివిధ జిల్లాలో గురువారం లంచం తీసుకుంటూ ముగ్గురు ప్రభుత్వ అధికారులు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఒకే రోజు మూడు అవినీతి కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో గురువారం లంచం తీసుకుంటూ ముగ్గురు ప్రభుత్వ అధికారులు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. సిద్దిపేట జిల్లా చేగుటం మండలం డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ 2 లక్షల 70 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు చేసి వేములవాడ ఠాణాలో పని చేస్తున్న హెడ్కానిస్టేబుల్ చంద్రప్రకాశ్ ఓ వ్యక్తి నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్, తెలంగాణ గవర్నమెంట్ టెక్స్ బుక్స్ ప్రెస్ అసిస్టెంట్ డైరెక్టర్ టి.నరేష్ కుమార్ రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడితే 1064 టోల్ ప్రీ నంబర్కు కాల్ చేయాలని ఏసీబీ డీజీ సూచించారు.