కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు

పార్లమెంట్ ఎన్నికల వేళ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం, వేదికను కాంగ్రెస్ ముహూర్తం ఖరారు చేసింది.

Update: 2024-03-28 11:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం, వేదికను కాంగ్రెస్ ముహూర్తం ఖరారు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌కు వెళ్లారు. ఓటు వేసిన అనంతరం ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏప్రిల్ 6వ తేదీన తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సభకు అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నట్లు తెలిపారు. అదే సభలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయబోతోందని చెప్పారు.

Tags:    

Similar News