కోర్టు జడ్జి మెంట్ రాకముందే.. రాహుల్‌ను ఎలా సస్పెండ్ చేస్తారు?

రాహుల్​గాంధీ అనర్హత వేటుపై లోక్‌సభ స్పీకర్​కనీసం వివరణ అడిగే ప్రయత్నం చేయలేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​మధుయాష్కిగౌడ్ అసహనం వ్యక్తం చేశారు.

Update: 2023-03-25 12:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్​గాంధీ అనర్హత వేటుపై లోక్‌సభ స్పీకర్​కనీసం వివరణ అడిగే ప్రయత్నం చేయలేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​మధుయాష్కిగౌడ్ అసహనం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వంలో అత్యంత దారుణాలు జరుగుతున్నాయన్నారు. కోర్ట్​జడ్జ్ మెంట్ సస్పెండ్‌లో ఉండగా, రాహుల్‌ను ఎలా సస్పెన్షన్​చేస్తారంటూ? ప్రశ్నించారు. మోడీ, అమిత్​షాలు అప్రజాస్వామికంగా వెళ్తున్నారన్నారు. అదానీతో మోడీకి ఉన్న వ్యాపార సంబంధాలు ఏంటో బయట పెట్టాలని? డిమాండ్​చేశారు.

ఎల్ఐసీ, ఎస్సీఐకి జరిగిన నష్టంపై బీజేపీ నేతలు మౌనం ఎందుకు వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో బీజేపీ రాహుల్ గాంధీపై తప్పుడు ఆరోపణలు చేసిందన్నారు. గుజరాత్‌లో మోడీ క్యాబినెట్‌లో శిక్ష పడ్డ వ్యక్తి మంత్రిగా ఎలా కొనసాగారో? మోడీకే తెలియాలన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు వీ.హనుమంతరావు మాట్లాడుతూ.. ఉరి శిక్షవేసే వాళ్ళను కూడా ఆఖరి కోరిక ఏమిటని అడగాలనేది? చట్టాల్లో ఉన్నదని, కానీ రాహుల్​గాంధీకి వివరణ ఇచ్చే సమయాన్ని ఇవ్వకపోవడం వెనక మోడీ పాత్ర ఉన్నదన్నారు. రాహుల్‌కు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి మోడీ తట్టుకోలేకపోతున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, నిరంజన్, వినోద్ రెడ్డి, సంగిశెట్టి జగదీష్, అజ్మతుల్లా హుసేన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News