ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం

ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది.

Update: 2023-05-21 07:37 GMT

దిశ, శంకరపట్నం : ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ వరి ధాన్యము లోడు చేసుకుని మానకొండూర్‌కు వెళ్తోంది. కేశవ పట్నం శివాలయం పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై బ్రిడ్జ్ వద్దకు చేరుకోగానే వెనుక నుండి వరంగల్ డిపోకు చెందిన టీఎస్ఆర్టీసీ అద్దె బస్సు ఢీ కొట్టింది. బస్సు నిజామాబాద్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టీఎస్ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు తెలిపారు.

Tags:    

Similar News