మునుగోడు ఉపఎన్నిక ఎఫెక్ట్.. భారీగా పెరిగిన ఇళ్లు, హోటల్స్ రెంట్

దిశ, వెబ్‌డెస్క్ : మునుగోడులో రాజకీయ వేడి రగులుకుంది. బైపోల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే పార్టీలు ప్రచారం మొదలు పెట్టేస్తున్నాయి.

Update: 2022-08-17 08:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మునుగోడులో రాజకీయ వేడి రగులుకుంది. బైపోల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే పార్టీలు ప్రచారం మొదలు పెట్టేస్తున్నాయి. నియోజక వర్గంలోని ముఖ్యనేతలను కలవడాని, పార్టీల నేతలందరూ మునుగోడుకు మకాం మార్చుతున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో ఉన్న అద్దె ఇళ్లకు రెంట్ పెరుగుతోంది. రాజకీయనాయకులందరూ మునుగోడుకు చేరుకోవడంతో నియోజక వర్గంలోని ఇళ్లకు, హోటళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా జాతీయ రహదారిపై ఉండే చౌటుప్పల్ పట్టణంలో అద్దె ఇల్లు, లాడ్జిలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఇప్పటివరకు రూ.10,000 పలికిన ఇల్లు షెటర్ అద్దెలు ఇప్పుడు రూ. 15000 దాటాయి. ఇక ఈనెల 22న మునుగోడులో అమిత్ షా సభ ఉన్న విషయం తెలిసిందే.


Similar News