ఆర్టీఐ ని ఆశ్రయించిన యువకుడు

మండలంలోని మాల్‌ గ్రామానికి చెందిన యువకుడు పల్లపు విజయ్ శనివారం తెలంగాణ రాష్ట్ర సమాచారహక్కు భవన్ ని ఆశ్రయించారు.

Update: 2022-12-17 14:20 GMT

దిశ, యాచారం : మండలంలోని మాల్‌ గ్రామానికి చెందిన యువకుడు పల్లపు విజయ్ శనివారం తెలంగాణ రాష్ట్ర సమాచారహక్కు అధికారులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాల్ గ్రామంలో కొన్ని ఇంటి నిర్మాణాల కోసం ఆ ఇంటి నెమ్బర్ లు ఎలా ఇచ్చారు అనే విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శిని సమాచార హక్కు చట్టం ద్వారా గత నెల 4న కోరారు.

దాదాపు 45 రోజులు గడుస్తున్నా ఆ కార్యదర్శి పట్టించుకోవడంలేదని అన్నారు. ఎలాంటి వివరాలు ఇవ్వలేదని అందుకే సమాచారహక్కు భవన్ ని ఆశ్రయించానని దాని విషయమై ఫిర్యాదు చేశానని తెలిపారు.

Tags:    

Similar News