వాకర్స్‌తో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మార్నింగ్ వాకర్‌ను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరారు.

Update: 2024-04-28 06:20 GMT

దిశ, మీర్‌పేట్: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మార్నింగ్ వాకర్‌ను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరారు. కాసాని జ్ఞానేశ్వర్ ముధిరాజ్ కు మద్దతుగా ఆదివారం కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు, మంత్రాల చెరువు వద్ద వాకర్సుతో కలిసి ఎమ్మెల్యే సబితా మార్నింగ్ వాక్ లో పాల్గొనీ ఓటు అభ్యర్థించారు. సబితతో పాటు మేయర్ యం దుర్గా దీప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ శ్రీ అర్కల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేష్ రెడ్డి, నియోజకవర్గ మహిళా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, కార్పోరేటర్లు మమత ప్రవీణ్, సిద్ధాల పద్మ అంజయ్య, అనిల్ కుమార్ యాదవ్, కో-ఆప్షన్ సభ్యులు జంగయ్య గౌడ్, రజాక్, వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, యూత్ అధ్యక్షుడు నాగరాజు, మహిళా అధ్యక్షురాలు సునీత బాల్ రాజ్, బీఆర్ఎస్ నాయకులు పంతంగి మాధవి, లతా శేఖర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Similar News