రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి వైపు దూసుకెళ్తుంది : వంశీచంద్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వైపు

Update: 2024-05-10 16:21 GMT

దిశ,షాద్ నగర్ : సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వైపు దూసుకుపోతుందని మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు.షాద్ నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యాక మహిళలందరూ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు, యువకులకు మూడు నెలల్లోనే 32వేల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి, పేద ప్రజలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు వస్తుందని అన్నారు.పేదలకు అందరికీ కూడా ఇవాళ రేవంతన్న పెద్దకొడుకయ్యి 10 లక్షల గుండె ధైర్యం ఆరోగ్య శ్రీ పథకాన్ని తెచ్చాడు అని అన్నాడు.

నరేంద్ర మోడీ సిలిండర్ రేటుని రూ. 400 నుంచి 1200 చేస్తే రేవంతన్న నా ఆడబిడ్డలు బాధపడొద్దు, కష్ట పడొద్దు అని రూ. 1200 ఉన్న సిలిండర్ ని ఇవాళ రూ.500 కి ఇస్తున్నాడు అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న కేసీఆర్, దేశంలో ఉన్న నరేంద్ర మోడీ పడేండ్లల్ల ఒక్క ఇళ్లు ఇయ్యకుంటే ఇయ్యాల రేవంతన్న ముఖ్యమంత్రి అయ్యి షాద్ నగర్ లో ఉన్న నిరుపెద్దలందరికిరూ. ఐదు లక్షలకి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనున్నారు అని, 9వ తారీకు వరకు రైతు భరోసా పైసలు ఇస్తామని ఆరవ తారీఖు నాడు వేశాం అని, ఆగస్టు 15వ తారీకు వరకు రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయబోతున్నాడు అని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ జడ్పీటీసీలు విశాల, జడ్పీటీసీ వెంకటరామిరెడ్డి తదితర కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News