శోభాయాత్రలో పాల్గొన్న కొండా

బిజెపి చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్నారు.

Update: 2024-04-18 15:35 GMT

దిశ, రాజేంద్రనగర్: బిజెపి చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని ఉప్పరపల్లి, శివరాంపల్లి లో నిర్వహించిన శోభాయాత్రకు ఆయన రాజేంద్రనగర్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిరక్షణ కోసం యువకులంతా ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు.

మోడీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమైక్య భావంతో కలిసి జీవిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. గత పదేళ్లుగా శోభాయాత్ర వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభినందించారు. హిందూ ధర్మ పరిరక్షణకు సాంస్కృతిక వికాసానికి శోభాయాత్ర లాంటి కార్యక్రమాలు ఎంతో దహనం చేస్తాయని ఆయన చెప్పారు. శోభయాత్రలో స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలతో పాటు వేలాది మంది యువకులు తరలివచ్చి పాల్గొన్నారు. మహిళలు చిన్నారులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేరింతలు కొట్టారు.

Similar News