భారీ మెజారిటీతో కొండా గెలుపు ఖాయం : తోకల శ్రీనివాస్

మైలార్ దేవు పల్లి డివిజన్ పరిధిలోని పద్మశాలీపురం, సాయిబాబా నగర్, బాబుల్ రెడ్డి నగర్ లో శనివారం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతుగా

Update: 2024-04-27 13:12 GMT

దిశ, రాజేంద్రనగర్ : మైలార్ దేవు పల్లి డివిజన్ పరిధిలోని పద్మశాలీపురం, సాయిబాబా నగర్, బాబుల్ రెడ్డి నగర్ లో శనివారం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతుగా రాజేంద్ర నగర్ నియోజక వర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీ కేంద్రంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేశారు. ప్రజల ఆశీర్వాదంతో విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని తెలిపారు. గెలుస్తారని చేవెళ్ల నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.

Similar News