నన్ను దీవించి ఆశీర్వదించినట్టే రంజిత్ రెడ్డిని దీవించండి : గడ్డం ప్రసాద్ కుమార్

గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను దీవించి ఆశీర్వదించినట్టుగా

Update: 2024-05-08 11:22 GMT

దిశ ప్రతినిధి, వికారాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను దీవించి ఆశీర్వదించినట్టుగా జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని కూడా దీవించి ఆశీర్వదించాలని వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వికారాబాద్ మండలం, మైలార్ దేవరంపల్లి గ్రామంలో నిర్వహించిన రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ అనంతరం మైలార్ దేవరంపల్లి గ్రామంలో సిసి రోడ్ల కోసం రూ.200 కోట్ల మంజూరుకై కృషి చేస్తానని, గ్రామ ప్రజల కోరిక మేరకు గ్రామానికి చెరువు తీసుకువచ్చే కార్యక్రమం చేస్తానని, చుట్టుపక్కల గ్రామాలన్నింటికి ఉపయోగపడేలా మైలార్ దేవరంపల్లిలో గ్రామీణ బ్యాంక్, పి.హెచ్.సి సెంటర్ ను తీసుకువస్తానని అన్నారు. మన ఊరు నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఈనెల 13న జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News