పేకాట స్థావరంపై దాడి.. డిప్యూటీ మేయర్ సహా కార్పొరేటర్లు అరెస్ట్

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో పేకాట స్థావంపై పోలీసులు దాడి చేశారు.

Update: 2023-01-29 15:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు కీలక నేతలను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పట్టుబడిన వారిలో పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ సహా కార్పొరేటర్లు, బిల్డర్లను మొత్తం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతోనే పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News