రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం తెలంగాణకు రానున్నారు

Update: 2024-04-28 17:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం తెలంగాణకు రానున్నారు. కొత్తగూడెం, మహబూబాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. 29న ఉదయం 11 గంటలకు కొత్తగూడెంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో నడ్డా ప్రసంగిస్తారు. అనంతరం మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో మధ్యాహ్నం 12:30 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. కాగా ఈ సభల అనంతరం జేపీ నడ్డా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని కుత్భుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నిజాంపేటలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో లో ఆయన పాల్గొంటారు. రోడ్ షో అనంతరం రాత్రి సమయంలో పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై వారితో చర్చించనున్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వెళ్తున్న కమలం పార్టీకి ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు.

Similar News