బ్రేకింగ్: పద్మ అవార్డ్లు ప్రకటించిన కేంద్రం.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్కు పద్మశ్రీ
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డ్లను ప్రకటించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 2022 ఏడాదికి సంబంధించి పద్మవిభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించగా అందులో తెలంగాణకు రెండు పద్మభూషణ్, నాలుగు పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. వారికి గురువారం కేంద్రం అందజేయనుంది. పద్మభూషణ్ అవార్డులు.. చిన్న జీయర్, కమల్ డి పాటిల్( ఆధ్యాత్మిక రంగం), పద్మశ్రీ అవార్డులు.. మొదడుగు విజయ్ గుప్తా(సైన్స్ అండ్ టెక్నాలజీ), ఎంఎం కీరవాణి( ఆర్ట్), పసుపులేటి హన్మంతరావు (మెడిసిన్), బి. రామక్రిష్ణారెడ్డి (లెక్చరర్ అండ్ ఎడ్యుకేషన్) ఎంపికయ్యారు.