NTR Jayanthi: తాతకు నివాళులు అర్పించిన జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..ఆకట్టుకున్న తారక్ ట్వీట్
- దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లు నివాళులర్పించారు. NTR Jayanthi
దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత నందమూరి తారక రామారావు శత జయంతి(NTR Jayanthi) సందర్భంగా సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR), కళ్యాణ్ రామ్(Kalyan Ram)లు నివాళులర్పించారు. శనివారం ఉదయం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్(Tank Bund) వద్దకు చేరుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన సమాధికి పుష్పాంజలి ఘటించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా దివంగత ఎన్టీఆర్ను ఉద్దేశిస్తూ, మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నపోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని ఈ గుండెని మరొక్కసారి సాకిపో తాతా.. అంటూ జూనియర్ చేసిన ట్వీట్ అందరిని ఆకట్టుకుంటుంది.