ప్రధాని సభను విజయవంతం చేయాలి

ఈనెల 30వ తేదీన ఆందోల్ పట్టణంలో నిర్వహించే ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణా రెడ్డి కార్యకర్తలను కోరారు.

Update: 2024-04-27 10:56 GMT

దిశ, లింగంపేట్ : ఈనెల 30వ తేదీన ఆందోల్ పట్టణంలో నిర్వహించే ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణా రెడ్డి కార్యకర్తలను కోరారు. మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో గల డీపీఎల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 30వ తేదీ మంగళవారం ఆందోల్ నియోజకవర్గంలో అల్లాదుర్గంలో నరేంద్ర మోడీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. మండల, గ్రామ, బూత్ కమిటీ

    నాయకులు సమన్వయంతో సభకు అధిక సంఖ్యలో కార్యకర్తలను, ప్రజలను తరలించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, మర్రి రామ్రెడ్డి, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్రావు, అసెంబ్లీ విస్తార్​ నరేందర్ రెడ్డి, మండల కో ఆర్డినేటర్ జక్సాని దత్తురాములు, కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్, మండల అధ్యక్షులు మాసుల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు వడ్ల రామచందర్, మంగలి నవీన్ కుమార్, మాజీ ఎంపీపీ భీమయ్య, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ నరహరి, మాజీ జెడ్పీటీసీ కమ్మరి వెంకటేశంతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Similar News