వచ్చే ఎన్నికల్లో యువత పాత్ర కీలకం: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్లాలని ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.

Update: 2023-02-06 16:24 GMT

దిశ, భిక్కనూరు: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్లాలని ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. భారత రాష్ట్ర సమితి దోమకొండ మండల ప్రచార కార్యదర్శిగా నియమితులైన పిన్నం నాగేంద్ర వర్మ, సోమవారం హైదరాబాదులోని విప్ గంప గోవర్ధన్ నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో యువత పాత్ర కీలకమన్నారు.

ముఖ్యంగా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు గంప శశాంక్ ను మర్యాదపూర్వకంగా కలసి శాలువా కప్పి సత్కరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ దోమకొండ మండల యువజన విభాగం అధ్యక్షుడు పాలకుర్తి శేఖర్, విజయ్, సందీప్, వినోద్ తదితరులు ఉన్నారు.

Similar News