న్యాయమైన పాలన అందించడం మోడీకే సాధ్యం

దేశ ప్రజలకు న్యాయ పరమైన పాలన అందించడం కేవలం మోడీతోనే సాధ్యమని మాజీ మంత్రి నేరేళ్ల ఆంజనేయులు స్పష్టం చేశారు.

Update: 2024-04-30 10:56 GMT

దిశ, లింగంపేట్ : దేశ ప్రజలకు న్యాయ పరమైన పాలన అందించడం కేవలం మోడీతోనే సాధ్యమని మాజీ మంత్రి నేరేళ్ల ఆంజనేయులు స్పష్టం చేశారు. లింగంపేట మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మోడీ ప్రధానిగా 10 సంవత్సరాల పాలనలో అవినీతి అక్రమాలు జరగలేదని వెల్లడించారు. మంత్రులపై సైతం అవినీతి ఆరోపణ లేకపోవడమే దీనికి నిదర్శనం అని అన్నారు. దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వెల్లడించారు. దేశ ప్రధానిగా మోడీ మూడోసారి గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని గ్రామీణ ప్రాంత పంచాయతీలకు నేరుగా నిధులు అందించిన ఘనత మోడీకే దక్కుతుందని అన్నారు.

    10 సంవత్సరాల పాలనలో జాతీయ రహదారులు ఎంతగానో అభివృద్ధి చెందాయని ఆయన వెల్లడించారు. సంగారెడ్డి నాందేడ్ అకోలా జాతీయ రహదారి పనులు ఇప్పటికే పూర్తయ్యాయని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్, కామారెడ్డి ఎల్లారెడ్డి (కే కేవై) జాతీయ రహదారి పనులు సైతం త్వరలో ప్రారంభం కానున్నాయని ఆయన వెల్లడించారు. రైతులకు అందించే రసాయన ఎరువుల సబ్సిడీ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన వెల్లడించారు. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో ఎన్నికల్లో ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. విలేకరుల సమావేశంలోబీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు దత్తురామ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు రామచందర్ నవీన్ కుమార్, నాయకులు బొల్లారం సాయిలు, ఉదయ్ కుమార్, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.  

Similar News