మంత్రాల అనుమానంతో తండ్రి పై తనయుడి దాడి

తన తండ్రి తరుచు మంత్రాలు చేస్తు న్నాడు అనే అనుమానంతో

Update: 2024-04-29 16:36 GMT

దిశ, భీంగల్ :తన తండ్రి తరుచు మంత్రాలు చేస్తు న్నాడు అనే అనుమానం తో కన్న తండ్రి పై తన కొడుకే కానిస్టేబుల్ అయి ఉండి దాడికి దిగిన ఘటన ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం వెలుగు చూసింది . భాధితుని అక్క రాజవ్వ పోలీస్ కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన రాజేందర్ అనే వ్యక్తి భీంగల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తన తండ్రి బుచ్చన్న తరచు మంత్రాలు చేస్తున్నాడానే అనుమానం తో ఈనెల 22న ఎనిమిది మందితో కలిసి ఇంటికి వచ్చి తండ్రి పై దాడి చేశారని కుటుంబికులు కమిషనర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన రోజే స్థానిక ధర్పల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని బాధితుని అక్క రాజవ్వ అంటున్నారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని భాధితుని కుటుంబీకులు, అక్క రాజవ్వ కమిషనర్ కల్పేశ్వర్ ను కోరుతున్నారు.భాధితుడు బుచ్చయ్య నగరంలోని మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

Similar News