విషాదం... గాంధారిలో దంపతుల ఆత్మహత్యాయత్నం

దంపతులిద్దరు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి...Couple attempted suicide

Update: 2022-11-25 07:58 GMT

దిశ, గాంధారి: దంపతులిద్దరు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలో సర్పంచ్ కిషన్ నాయక్ కు చెందిన 240 గజాల స్థలాన్ని తాము కొనుగోలు చేశామని, అందుకు సంబంధించిన డబ్బు కూడా మొత్తం చెల్లించామని, అయినా ఆ స్థలాన్ని కిషన్ నాయక్ తమకు రిజిస్ట్రేషన్ చేయడంలేదంటూ మనస్తాపంతో బానోత్ శంకర్, సునీత్ అనే దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి విషమంగా మారడంతో వారిని వెంటనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

Tags:    

Similar News