ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా కోడంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన ఎక్స్ అఫీషియో ఓటు వేశారు.

Update: 2024-03-28 09:22 GMT

దిశ, బొంరాస్ పేట్ : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా కోడంగల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన ఎక్స్ అఫీషియో ఓటు వేశారు. 56 మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 100 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు.      

Similar News