పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి

పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి చెందిన సంఘటన మండలంలోని ఆగా మోత్కూర్ గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

Update: 2023-03-17 10:16 GMT

దిశ, మాడుగులపల్లి :పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి చెందిన సంఘటన మండలంలోని ఆగా మోత్కూర్ గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఆగ్రా మోత్కూర్ గ్రామానికి చెందిన బంటు సతీష్ కు చెందిన రెండు గేదెలు పశువుల కొట్టంలో కట్టివేయ గా గురువారం రాత్రి కురిసిన వర్షాలకు పిడుగు పడింది. పశువుల కొట్టం పై పిడుగు పడటంతో రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయని బాధితులు తెలిపారు. సుమారు లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు వాపోయారు.

Tags:    

Similar News