డబుల్ బెడ్ రూం ఇళ్లు రాలేదని మహిళ ఆత్మహత్యాయత్నం (Video)

డబులు బెడ్ రూం ఇళ్లు దక్కలేదని ఆరోపిస్తూ శనివారం మిర్యాలగూడ పట్టణలోని 29వ వార్డుకి చెందిన...Tension at Miryalaguda

Update: 2023-03-04 07:49 GMT

దిశ, మిర్యాలగూడ: డబులు బెడ్ రూం ఇళ్లు దక్కలేదని ఆరోపిస్తూ శనివారం మిర్యాలగూడ పట్టణలోని 29వ వార్డుకి చెందిన భాగ్యలక్ష్మి అనే మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకి యత్నించింది. భర్త వ్యసన పరుడని, నలుగురు పిల్లలు అని, తమకు ఇళ్ళు కిరాయికి దొరకడం లేదని వాపోయింది. ఇండ్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ ఆవేదన చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. అప్రమత్తం అయిన పోలీసులు అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆర్డీవో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. 


Tags:    

Similar News