మేళ్లచెరువు, చింతలపాలెంలో భూ ప్రకంపనలు

చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో ఆదివారం ఉదయం 7.25 నిమిషాల ప్రాంతంలో భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Update: 2023-02-19 05:01 GMT

దిశ, మేళ్లచెరువు: చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో ఆదివారం ఉదయం 7.25 నిమిషాల ప్రాంతంలో భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గతంలో కూడా ఉమ్మడి మండలంలో తరచూ ఇలాగే జరగడంతో భూకంపనలకు గురించి శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. పులిచింతల ప్రాజెక్టు వల్ల భూమిలో పొరల మధ్య నీటి చేరడం వల్ల ఈ ప్రకంపనాలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. ఈ మధ్య కాలంలో భూమిలో శబ్దాలతో కూడిన కదలికలు రావటంతో ఈ ప్రాంత ప్రజల్లో కొంత ఆందోళన మొదలైంది. ఈ విషయమై అధికారులను ప్రశ్నించగా పూర్తి వివరాలు అధ్యయనం చేసిన తర్వాత వివరిస్తామని తెలిపారు.

Tags:    

Similar News