కారులో చెలరేగిన మంటలు

ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలలో బెంబేలెత్తిపోతున్న సూర్యాపేట జిల్లా కేంద్ర ప్రజలకు మరో వాహన గండం తప్పింది.

Update: 2024-04-24 10:34 GMT

దిశ, సూర్యాపేట : ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలలో బెంబేలెత్తిపోతున్న సూర్యాపేట జిల్లా కేంద్ర ప్రజలకు మరో వాహన గండం తప్పింది. స్ధానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద పాత జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కారు దగ్ధమైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఆ సమయంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ముందే పడిగట్టడంతో సురక్షితంగా బయటపడ్డారు. తక్షణమే ఆ ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది

    ఈ ఘటనపై స్పందిస్తూ వేసవి కాలం దృష్ట్యా కారులోని వైర్లు ఒకదానికొకటి ఆనుకొని షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. చివ్వెంల మండలం వట్టి కాంపాండు గ్రామానికి చెందిన గోపాలరావు అతని కుటుంబ సభ్యులతో కలిసి పని నిమిత్తం సూర్యాపేటకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు కారు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలను ఆర్పివేశారు.  

Similar News