పిచ్చి పిచ్చిగా వాగితే తాటతీస్తాం: మంత్రికి Bandi Sanjay స్ట్రాంగ్ వార్నింగ్

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై టీ-బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

Update: 2022-12-05 11:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై టీ-బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మంత్రి అవినీతి చిట్టా మొత్తం సిద్ధంగా ఉందని.. మున్సిపల్ స్కామ్‌లో తిన్నదంతా కక్కిస్తామని మంత్రికి బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీడియా ముందు పిచ్చి పిచ్చిగా వాగితే తాటతీస్తామని హెచ్చరించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అవినీతికి సహకరించిన కలెక్టర్ జాగ్రత్తగా ఉండాలని.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భరతం పడతామని వార్నింగ్ ఇచ్చారు.

బండి సంజయ్ ఆరోపణలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం అదే రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు. తనపై అవినీతి ఆరోపణలు చేసిన బండి సంజయ్‌కి పది రోజులు టైమ్ ఇస్తున్నానని.. అప్పటిలోగా తన అవినీతి చిట్టా బయటపెట్టాలని మంత్రి సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని తాను సవాల్ చేస్తున్నానని.. అలాగే బీజేపీ ప్రజలకు ఏమి చేసిందో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇష్టం వచ్చినట్లు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు తరిమికొడతారని మంత్రి హెచ్చరించారు. బండి సంజయ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్, ప్రతి సవాళ్లతో నిర్మల్ జిల్లా రాజకీయాలు హీటెక్కాయి.

Read more:

బండి సంజయ్‌కి పది రోజులు టైమ్ ఇస్తున్నా: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

Tags:    

Similar News