కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్‌లో స్వల్ప మార్పులు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో మార్పులు జరిగాయి. ఈనెల 25న ఆయన పర్యటన ఖరారు కాగా తొలుత

Update: 2024-04-22 06:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో మార్పులు జరిగాయి. ఈనెల 25న ఆయన పర్యటన ఖరారు కాగా తొలుత జహీరాబాద్‌లో పర్యటిస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా అమిత్ షా పర్యటన జహీరాబాద్‌లో కాదని, మెదక్ పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తున్నారని స్పష్టంచేశారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం సిద్దిపేటలో బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహించే బహిరంగ సభకు ఆయన పాల్గొననున్నారు.

Read More...

చామల ఓటమిని కోమటిరెడ్డి బ్రదర్స్ పై వేసేందుకే సీఎం రేవంత్ ప్రలోభాలు: బూర నర్సయ్య గౌడ్ 

Tags:    

Similar News