బ్రేకింగ్: సిద్ధంగా ఉండండి.. ఎన్నికలపై మంత్రి KTR కీలక వ్యాఖ్యలు

నిజామాబాద్ పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలని.. ఏ సందర్భంలో వచ్చిన రెడీగా ఉండాలని సూచించారు.

Update: 2023-01-28 08:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలని.. ఏ సందర్భంలో వచ్చిన రెడీగా ఉండాలని సూచించారు. రాబోయే ఏడు నెలల పాటు నిర్వీరామంగా పనిచేయాలన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో బీఆర్ఎస్ నేతలు గెలవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ముందస్తుకు వెళ్తే.. తాము కూడా సిద్ధంగా ఉన్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అని కేటీఆర్ జోస్యం చెప్పారు. తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తామన్నారు ఏమైందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్రం నుండి ఏం తెచ్చారని నిలదీశారు. 

ఇవి కూడా చదవండి:   ఆ లెక్క తప్పు అయితే రాజీనామాకు సిద్ధం: మంత్రి KTR ఛాలెంజ్

Tags:    

Similar News