బండి సంజయ్‌కి పది రోజులు టైమ్ ఇస్తున్నా: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్

టీ-బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ఐదవ విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర నిర్మల్ జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతోంది.

Update: 2022-12-05 10:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీ-బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ఐదవ విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర నిర్మల్ జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. పాదయాత్ర సందర్భంగా నిర్మల్ జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు అనేక కబ్జా కుంభకోణాల్లో పాలుపంచుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనపై అవినీతి ఆరోపణలు చేసిన బండి సంజయ్‌కి పది రోజులు టైమ్ ఇస్తున్నానని.. అప్పటిలోగా తన అవినీతి చిట్టా బయటపెట్టాలని మంత్రి సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని తాను సవాల్ చేస్తున్నానని.. అలాగే బీజేపీ ప్రజలకు ఏమి చేసిందో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇష్టం వచ్చినట్లు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. 

Read more:

పిచ్చి పిచ్చిగా వాగితే తాటతీస్తాం: మంత్రికి బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్

డబుల్ ఇంజన్ పాలన దగా ముచ్చటే: బీజేపీపై హరీష్ రావు ఫైర్ 

Similar News