సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే : ఎమ్మెల్యే సాయన్న

ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు.

Update: 2022-12-06 15:47 GMT

దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి : ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పేర్కొన్నారు. మూడో వార్డులోని మడ్ ఫోర్ట్ లో ని రెండు పడక గదుల నిర్మాణాల సముదాయంలో మంగళవారం తిరుమలగిరి పరిధిలోని 25 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఆయన చెక్కులను అందజేశారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆర్థికంగా సహకారమందిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి తహసీల్దార్ హసీనా బేగం, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్ , పాండు యాదవ్, బోయిన్ పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. 

Similar News