స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు.

Update: 2024-05-05 09:34 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. ఓటింగ్ శాతం పెంపు లక్ష్యంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 5కే రన్ నిర్వహించారు. జెండా ఊపి 5కే రన్ ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ...మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించకొని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్​వీఈఈపీ నోడల్ అధికారి జయదేవ్ ఆర్యా, అధికారులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. అనంతరం ఓటర్ అవేర్నెస్ కార్యక్రమానికి స్వయంగా గీత రచన, స్వర కల్పన చేసిన గజ్వేల్ పట్టణానికి చెందిన రాయరావు, విశ్వేశ్వరరావు బృందాన్ని కలెక్టర్ శాలువాతో సన్మానం చేశారు. 

Similar News