మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం

మద్యం మత్తులో అతివేగంతో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

Update: 2024-05-18 10:24 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మద్యం మత్తులో అతివేగంతో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కోదాడకు చెందిన లారీ డ్రైవర్ సరుకులు దింపి తిరిగి వెళ్తున్న క్రమంలో సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్ చౌరస్తాలో లారీ అదుపు తప్పింది. బీజేఆర్ చౌరస్తాలో గల బాబు జగ్గీవన్ రామ్ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన ఫౌంటేన్ లోకి లారీని ఎక్కించాడు. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో పరిసర ప్రాంతంలో ఎవ్వరూ లేకపోవడంతో పేను ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News