అబద్దాల కాంగ్రెస్ ను తరిమికొట్టండి

అబద్దాల హామీల పునాదులపై గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Update: 2024-05-05 11:19 GMT

దిశ,పటాన్ చెరు : అబద్దాల హామీల పునాదులపై గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ఏఆర్ బృందావన్ కాలనీ, బృందావన్ టీచర్స్ కాలనీలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ ఆయా కాలనీల సంక్షేమ సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామంటూ ప్రగల్బాలు పలికిన అధికార కాంగ్రెస్ పార్టీని అమలు చేయాలని

    ప్రశ్నిస్తే పార్లమెంట్ ఎన్నికలకు ముడి పెట్టడం కాంగ్రెస్ పార్టీ నైజానికి అద్దం పడుతోందని విమర్శించారు. 6 గ్యారంటీలు అమలు కావాలంటే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత నాలుగు సంవత్సరాలలో అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి కాలనీలో కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి ఆర్థిక స్వావలంబన అందించి అండగా నిలిచామని తెలిపారు. ఉన్నత విద్యావంతుడు, ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ బరిలో నిలిపిందని, అలాంటి వ్యక్తిని పార్లమెంటుకు పంపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహా గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Similar News