గద్వాల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత.. సీఐ, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మధ్య వాగ్వాదం
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దిశ, గద్వాల ప్రతినిధి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు హక్కును వినియోగించుకునేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి క్యూ లైన్లో నిలబడ్డారు. ఈ క్రమంలోనే ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యేను, ప్రజాప్రతినిధులను అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ సీఐ భీమ్కుమార్ వారిని వారించారు. దీంతో స్పందించి స్థానిక ఎమ్మెల్యే వికలాంగురాలు ఓటు వేసేందుకు వచ్చిందని, ఆమె ఓటు వేశాక అక్కడి నుంచి వెళ్తామని సీఐకి తెలిపారు. అయినా వినని సీఏతో ఎమ్మెల్యేతో దురుసుగా మాట్లాడారు. ఈ పరిణామంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రక్త పరిస్థితి నెలకొంది. అయితే, స్థానిక పోలీసు అధికారులు జోక్యం చేసుకుని ఇరువురికి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.