భాజపాతోనే భారత్ అభివృద్ధి : డీకే అరుణ

భారతదేశాన్ని పదేళ్ల పాలనలో ప్రపంచంలో అగ్రగామిగా ప్రధాని

Update: 2024-05-08 13:58 GMT

దిశ, కొత్తూరు : భారతదేశాన్ని పదేళ్ల పాలనలో ప్రపంచంలో అగ్రగామిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిపారని భాజపా మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ, పెంజర్ల, తిమ్మాపూర్, కొత్తూరులో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్తూరు మున్సిపాలిటీలో సాయంత్రం నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు భారత రక్షణకు సంబంధించినవని పేర్కొన్నారు. మీరు వేసే ప్రతి ఓటు మోడీ చేతికే అందించే ఒక ఆయుధమని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో అముడాపురం నరసింహ గౌడ్, మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు నాగరాజు చారి, మండల అధ్యక్షుడు మంగలి రమేష్, సదానందం గౌడ్, మాణిక్యం పాల్గొన్నారు.

Similar News