దేశంలో స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం అంటే దానికి కారణం నరేంద్ర మోడీ : భరత్ ప్రసాద్

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్

Update: 2024-05-08 15:40 GMT

దిశ,గోపాల్పేట్: పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ గోపాల్పేట మండల కేంద్రంలో రోడ్ షోలో పాల్గొనడం జరిగింది. కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు దేశంలో స్వేచ్ఛగా బ్రతుకుతున్నాము అంటే దానికి కారణం నరేంద్ర మోడీ అని అన్నారు. కరోనా ప్రభావం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఇది చూసి చలించి పోయిన మన ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్ పంపించడం వల్ల దేశ ప్రజలను కాపాడుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా గోపాల్పేటలోని పోస్ట్ ఆఫీస్ కేంద్రాన్ని నరేంద్ర మోడీ చొరవతో ఎంపీ రాములు సహకారంతో ఓపెనింగ్ చేసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. అదేవిధంగా ఒక బీజేపీ పార్టీకి తప్ప ఏ పార్టీకి ఈ దేశాన్ని కు ప్రధాని అయ్యే అవకాశం లేదని, ఇంకా చెప్పాలి అంటే మిగతా ఏ పార్టీలకు ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా తెలియదని ఆయన అన్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ ఆశీస్సులతో నన్ను నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా నియమించడం జరిగింది.

కావున మీరంతా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు. దేశంలోని మరో చైనా వైరస్ రాకుండా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావడం చాలా అవసరం అన్నారు. భారతీయ జనతా పార్టీని ఓడించడానికి ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయని వారు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది బీజేపీ పార్టీ అని ఆయన మరోసారి గట్టిగా అన్నారు. నరేంద్ర మోడీని మూడోసారి ని ప్రధానమంత్రిని చేసే బాధ్యత మనందరి పైన ఉంది, అదే విధంగా భారతదేశంలో రామరాజ్యం కావాలి అంటే కేవలం అది బిజెపితోనే సాధ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, మండల ఇంచార్జ్ రామన్న, వెంకటరెడ్డి, మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు అరవింద్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు నారాయణ యాదవ్, మండల కార్యకర్తలు, కేశవులు, సూర్య ప్రకాష్, దామోదర్, రవితేజ, దిలీప్, మల్లికార్జున, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Similar News